టాప్ డైరెక్టర్ అతను.45 ఏళ్లుగా ఎన్నో సినిమాలు తీశాడు.పండ్లతో పాటలు ఆయన స్పెషలిటీ.గత 45 ఏళ్లలో ఎప్పుడు కెమెరాకు కనిపించని ఆ దర్శకుడు 78 ఏళ్ల వయసులో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్నాడట.ఎవరు ఆ దర్శకుడు అని తెలుసుకోవాలనుంది కదా! అతడు ఎవరో కాదు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు.ఆశ్చర్యంగా ఉంది కదా! ఉంటుంది మరి.ఎందుకంటే ఆయన ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడడు.కెమెరా ముందు అయితే అసలు మాట్లాడడు.
అలాంటి నటుడు సినిమాల్లో నటించడం ఏంటి అని మీకు ఆశ్చర్యం వేయచ్చు.
కానీ నిజం ఇది.ఎంతో ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఎవరిని కదిలించిన సరే.అవునంట.అంటూ వార్తలు వస్తున్నాయ్.అది కూడా కథకు తగ్గట్టుగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.వాళ్ళు కూడా స్టార్ హీరోయిన్లు.రమ్య కృష్ణ, త్రిష, శ్రీయలు కలిసి ఈ సినిమాలో నటించనున్నారట.
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
ఈ ముగ్గురిని ఎంతో అందంగా చూపించి స్టార్ హీరోయిన్స్ గా చేశాడు రాఘవేంద్ర రావు.
అందుకే ఆయనపై గౌరవంతో ఈ ముగ్గురు హీరోయిన్లు ఆయన సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారట.మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఒక సాధారణ నటుడిని కూడా స్టార్ హీరోలాగా చేసిన ఘనత కేవలం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుగారికే సొంతం.మరి 78 ఏళ్ల వయసులో ఆయన నటిస్తాడా? ఓపిక ఉండాలే కానీ.నటనకు, వయసుకు సంబంధం ఏముంది చెప్పండి!
.