ప్రభుత్వం ఇచ్చిన పలు కీలక హామీల్లో నిరుద్యోగ భృతి ఒకటి.మొదటి దఫా ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోయినా ఈ దఫా ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అమలు చేస్తుందని నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా నిరుద్యోగ భృతిపై కేటీఆర్ పై అనధికారిక ప్రకటన చేసారు.త్వరలో తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించనున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ ప్రకటనపై బీజేపీ ఫైర్ బ్రాండ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.75 వేలు ఇవ్వాల్సి ఉందని, అవి ఇచ్చాక నిరుద్యోగ భృతిపై వ్యాఖ్యానిస్తే బాగుంటుందని రాములమ్మ విమర్శించారు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ల ఓటమితో టీఆర్ఎస్ లో చలనం వచ్చిందని, ఇక వచ్చే నాగార్జున సాగర్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తే మర్చిపోయిన హామీలన్నీ గుర్తుకు వస్తాయని రాములమ్మ విమర్శించారు.
బీజేపీ దెబ్బకు టీఆర్ఎస్ లో మార్పు వస్తున్నదని, ప్రజలు ఈ పరిణామంతో సంతోషపడుతున్నారని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు టీఆర్ఎస్ ను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తి ఉండదని అన్నారు.ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల తరపున పోరాడి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాములమ్మ అన్నారు.