బీజేపీ తీరుపై మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర నాయకత్వం తనను మౌనంగా ఉంచిదన్నారు.
తనకు మాట్లాడే అవకాశం కూడా ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలకే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు.సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి హాజరైన రాములమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వేడుకల్లో మాట్లాడాలి అనుకుంటే అవకాశం రాలేదన్నారు.అనంతరం పార్టీ బాధ్యతలు ఇచ్చినప్పుడే ఏమైనా చేయగలమని చెప్పారు.
తన పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుందన్న ఆమె.తనకు బాధ్యతలు లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేయాలంటూ వ్యాఖ్యనించారు.