ఈనాడు, ఈటీవీ లతో మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న మీడియా కింగ్ రామోజీ రావు ఉషాకిరణ్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా కూడా తన టేస్ట్ కి తగ్గ సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అలాగే తెలుగులో ఫస్ట్ బయోపిక్ ఈ బ్యానర్ లోనే రావడం విశేషం.
సుధాచంద్రన్ జీవిత కథని కాస్తా సినిమాటిక్ స్టైల్ లో మయూరి సినిమా ద్వారా తెరపై ఆవిష్కరించారు.ఆ సినిమాలో నేరుగా సుధా చంద్రన్ నటించడం విశేషం.
ఇదిలా ఉంటే ఈటీవీ చానల్ లో కామెడీ, డాన్స్ అండ్ గేమ్ రియాలిటీషోలతో టీవీ ఎంటర్టైన్మెంట్ లో కూడా ఈటీవీ చానల్ తన హవా కొనసాగిస్తుంది.అలాగే ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
లాక్ డౌన్ సమయంలో సుమారు అన్ని బాషల సీరియల్స్ రామోజీ ఫిల్మ్ సిటీ లోనే షూటింగ్ జరుపుకున్నాయి.అలాగే అన్ని బాషల సినిమాలు కూడా ఆర్.ఎఫ్.సీనే నమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే ఇక వ్యాపార రంగంలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న రామోజీరావు ఇప్పుడు డిజిటల్ మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు.తెలుగులో మరో ఒటీటీ ఛానల్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికోసం ఆరంభంలోనే ఏకంగా 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఉషాకిరణ్ మూవీ బ్యానర్ లో కొత్త టాలెంటెడ్ దర్శకులకి అవకాశాలు ఇచ్చి డిఫరెంట్ కథలతో వెబ్ ఫిలిమ్స్ తెరకెక్కించి ఈ ఛానల్ లో రిలీజ్ చేయాలని రామోజీ భారీ ప్లాన్ వేసారని టాక్.