ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా ప్రభావంతో అల్లాడుతోంది.ఇప్పటికే పలు దేశాల్లో లాక్డౌన్ విధించారు.
కాగా కరోనా వైరస్ బారిన పడిన వారిని క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నారు.ఈ వైరస్ మహమ్మారి ఇప్పటికే భారత్లో కూడా తన పంజా విసురుతుండటంతో రోజురోజూకు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకులను సైతం అవాక్కయ్యేలా చేసింది.తనకు కరోనా పాజిటివ్ ఉందని వర్మ ట్వీట్ చేశాడు.
డాక్టర్లు తనకు కరోనా వైరస్ పాజిటివ్ ఉందని తెలిపారని ఆయన వెల్లడించాడు.దీంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.
అయితే ఇదంతా కేవలం సరదా కోసమే తాను ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఏప్రిల్ 1న ఫూల్స్ డే సందర్భంగా ప్రజలను ఫూల్ చేద్దామని ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు తెలిపాడు.
కానీ వర్మ పెట్టిన ఈ పోస్ట్కు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.ఇలాంటి సమయంలో జోకులేంటి అని వారు మండి పడుతున్నారు.కాగా వర్మ అభిమానులు మాత్రం ఆయనకు ఎలాంటి కరోనా పాజిటివ్ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.