రామ్ గోపాల్ వర్మ గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న సినిమాలు ఆయనపై జనాల్లో ఉన్న గౌరవంను పోగొడుతున్నాయి.చిల్లర కాన్సెప్ట్లతో వివాదాస్పద అంశాలతో ఆయన సినిమాలు చేస్తూ కొందరికి మాత్రమే మంచి అనిపించుకుంటున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత క్రియేటివ్గా ఏదైనా సినిమా చేస్తాడనుకుంటే వర్మ మళ్లీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమా తీశాడు.ఆ సినిమా విడుదలకు ప్రస్తుతం కష్టపడుతుంది.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా ప్రస్తుతం కోర్టులో ఉంది.టైటిల్ మార్చినా కూడా విడుదలకు ఇంకా చాలా అడ్డంకులు ఉన్నాయి.అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ టైటిల్ను మార్చిన దర్శకుడు వర్మ విడుదలకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా ఒక వర్గం వారు తప్ప ఆ సినిమాను పట్టించుకుంటున్న నాధుడే కరువయ్యాడు.
అయినా కూడా వర్మ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరో సినిమాను ప్రకటించాడు.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల ఇంకా కానే కాలేదు.అప్పుడే వర్మ ఆ సినిమాను సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.ఆ సినిమాలో మరింత డెప్త్గా ఏపీ రాజీకాయలను ఆయన టచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.
మొత్తానికి ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు తీవ్రంగా వర్మ ప్రయత్నిస్తున్నాడు.ఈయన సినిమాలు అన్ని కూడా జగన్కు అనుకూలంగా ఉంటున్నాయనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.