కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా ట్రైలర్ ను జనాల్లోకి వదిలి తెలుగుదేశం పార్టీకి ఎంత చేయాలో అంత చేసేసాడు రాంగోపాల్ వర్మ.ముఖ్యంగా పప్పులాంటి అబ్బాయి అంటూ ఓ పాటను వదిలి లోకేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాడు వర్మ.
ఎక్కడ కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఉంటుందో దానినే తన సినిమా కథగా ఎంపిక చేసుకుని దానిని సినిమాగా తీసి వివాదాలు సృష్టించి వినోదం పొందుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు వర్మ.
ఆ విధంగానే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమా తీసి అందులో టిడిపి, జనసేన, వైఎస్ఆర్ సి పి , ప్రజాశాంతి పార్టీ ఇలా ఎవర్ని వదలకుండా వివాదంలోకి లాగారు వర్మ.ఇక ఆ సినిమా రిలీజ్ కూడా త్వరలో చేయబోతున్నాడు.
ఇంకా ఇంకా ఆ సినిమా జనాల్లోకి రాకుండానే దాని పర్యవసానాలు చూడకుండానే దానికి సీక్వెల్ తీసేందుకు రెడీ అయిపోయాడు.ఈ మేరకు ట్విట్టర్లో ఆ విషయాన్ని ప్రకటించాడు.
టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ టిడిపి నాయకుల మీద చేస్తున్న విమర్శలు, ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.ఇక ఆ సీక్వెల్ కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే పేరు పెడతా అంటూ ప్రకటించాడు వర్మ.
ఈ సీక్వెల్ లో ఇంకెంత కాంట్రవర్సీ చూపించి ఎవరి పరు,వు తీస్తాడో చూడాలి
.