ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఏది చెప్పినా ఏది చేసినా ఆసక్తికరంగానే జనాలకు ఉంటుంది.ఎన్నికల ముందు వరకు ఆయన ఏపీ రాజకీయాల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
నరసాపురం నుంచి ఎంపీగా బరిలోకి దిగిన పాల్ నరసాపురం ను నార్త్ అమెరికా చేస్తాను అంటూ హడావుడి చేశాడు.ఎన్నికలు ముగిశాయి పాల్ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు రాకపోవడంతో సైలెంట్ గా అమెరికాకు వెళ్ళిపోయాడు.
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అంటూ రాజకీయ కోణం లో ఓ సినిమా తీయడం, అందులో కే ఏ పాల్ పాత్రను కామెడీ గా చూపించడం తదితర విషయాలపై పాల్ మళ్లీ వెలుగులోకి వచ్చాడు.వర్మపై రకరకాల కామెంట్లు చేస్తూ హడావుడి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాల్ మరోసారి స్పందించాడు.కులాలు, మతాల మధ్య వర్మ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తాను ప్రార్థనలు చేసి చట్టాన్ని ఆశ్రయించి సినిమాలో తన పేరు ఎక్కడ వాడకుండా చేశాను అంటూ పాల్ చెప్పుకొచ్చారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటో మార్ఫింగ్ చేసి తాను అనుమతి ఇచ్చినట్టు వర్మ చెప్పుకున్నారని, చివరికి సత్యమే గెలిచింది అని చెప్పారు.అయినా ఇప్పటికీ మార్పు రాలేదని, తాను లంచాలు ఇచ్చి ఆ సినిమా ఆపడానికి ప్రయత్నించానని చెబుతున్నాడని అందుకే ఆ సినిమా ప్లాప్ తగిన బుద్ధి వచ్చేలా చేసిందని ఆయన వెటకారం చేశారు.
వర్మ నోరు విప్పితే అన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.