అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ పొలిటికల్ కామెడీ సినిమా తీసి రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ మీద వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.సినిమా విడుదలకు ముందే రాంగోపాల్ వర్మపై రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నో కామెంట్స్ చేశారు.
అయితే వర్మ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు.ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఎన్నో అడ్డంకులు ఎదురయినా అన్నిటిని వర్మ ఎదుర్కొన్నారు.
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా వర్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్లను టార్గెట్ చేసుకున్నారు.దీనిపై టీడీపీ అభిమానులు కోర్టులో వర్మపై కేసులు వేశారు.
ఇక పవన్ ఫ్యాన్స్ అయితే వర్మ శ్రద్ధాంజలి పోస్టర్లు పెట్టి రోడ్డుపై నిరసనకు దిగారు.ఇక కేఏ పాల్ అయితే ఈ సినిమా విడుదల తరువాత కూడా వర్మను వదిలిపెట్టకుండా వెంటాడుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సెల్ఫీ వీడియోలు బయటకి వదులుతూ హడావుడి చేస్తున్నారు.తాను కోర్టుకు వెళ్లడం వల్లనే చిత్రం టైటిల్ మార్చడంతో పాటు చాలా సీన్లు తొలిగించారు అంటూ పాల్ చెప్పుకుంటున్నాడు.
క్రిస్మస్ నెలలో తన టైమ్ వేస్ట్ చెయ్యడానికి వర్మ ట్రై చేస్తున్నాడని అతని ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అంటూ వర్మ చెబుతున్నాడు.ప్రపంచం మొత్తంలో తనతోనూ, జీసస్తోనూ పెట్టుకున్న ఏడుగురు అడ్రస్ లేకుండా అయిపోయారని, త్వరలోనే వర్మ కూడా అదే క్యాటగిరిలో చేరిపోతారు అంటూ కేఏ పాల్ శాపనార్ధాలు పెట్టారు.