రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను విడుదలకు సిద్దం చేసిన వర్మ సెన్సార్ ముందుకు తీసుకు వెళ్లగా అక్కడ సమస్య ఏర్పడింది.సినిమా రెండు కులాలు మరియు పార్టీల మద్య విభేదాలు సృష్టించేదిగా ఉందని, అందుకే ఈ సినిమాకు సెన్సార్ క్లీయరెన్స్ ఇవ్వలేం అంటూ చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వర్మ వెనక్కు తగ్గి సినిమా టైటిల్ను మార్చినట్లుగా సమాచారం అందుతోంది.
టైటిల్ మార్చిన విషయాన్ని టీవీ9 ఇంటర్వ్యూలో వర్మ స్వయంగా ప్రకటించాడు.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు కాకుండా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ పెట్టినట్లుగా ప్రకటించాడు.
టైటిల్ లో కులాల గొడవ లేదు కనుక సెన్సార్ ఈజీగానే అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఈనెల 29న అంటే ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు.
ఈసినిమాలో వర్మ చంద్రబాబు, పవన్ ఇంకా లోకేష్ను టార్గెట్ చేసిన విషయం తెల్సిందే.ముఖ్యంగా కేఏపాల్ పాత్రపై కూడా ఆసక్తి నెలకొంది.కోర్టు కేసులు మరియు సెన్సార్ తిప్పల నేపథ్యంలో విడుదల అయ్యేనా అనుకుంటున్న సమయంలో టైటిల్ మార్చడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యి విడుదలకు సిద్దం అవుతుంది.