టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఒక వెలుగు వెలిగి ఆనక ఆరిపోయిన దీపంలా మారిపోయిన రమణ దీక్షితులు మళ్లీ విధుల్లో చేరడానికి ఎంతో ప్రయాసపడిన విషయం అందరికి తెలిసిందే.మొత్తానికి ఆయన శ్రమ ఫలించింది.
ఏపీ సీయం కనికరించారు.తాజాగా పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ ఆదేశంతో రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు.ఇలా అనుకున్నది సాధించుకున్న రమణ దీక్షితులు సంతోషంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ ను కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నాడని, జగన్ ను మహావిష్ణువుతో పోల్చారు.కాగా అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని సీయంను కోరినట్లుగా పేర్కొన్న దీక్షితులు తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదని, అనవసరంగా దేవస్థానం విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.