రామ్, లింగుసామి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీలో విలన్ గా ఆది పినిశెట్టిని ఎంచుకున్నారని తెలుస్తుంది.రామ్ కోసం సరైనోడు విలన్ ఆదినే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు.
సినిమాలో పాత్ర డిమాండ్ చేయడమే కాదు మార్కెట్ పరంగా కూడా ఈ సినిమా ఈక్వేషన్స్ కోసమే ఆదిని విలన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.అదేంటి అంటే రామ్ తో లింగుసామి చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
బైలింగ్వల్ గా వస్తున్న ఈ సినిమాలో అక్కడ ఇక్కడ తెలిసిన నటులు కావాల్సి ఉంటుంది.ముఖ్యంగా విలన్ విషయంలో ఆ కాలిక్యులేషన్ చూసుకునే ఆదిని ఎంపిక చేశారని తెలుస్తుంది.
ఆది తమిళ నటుడే తెలుగులో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు.సరైనోడులో వైరం ధనుష్ పాత్రలో మెప్పించాడు.
ఇక రంగస్థలం సినిమాలో కూడా చరణ్ బ్రదర్ గా మంచి పాత్రలో నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడు రామ్ తో ఫైటింగ్ కు రెడీ అవుతున్నాడు.
ఆది సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న అన్ని తెలుగు సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి ఆ సెంటిమెంట్ తో కూడా ఆదిని విలన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.మొత్తానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు సరైన విలన్ ను దించుతున్నాడు లింగుసామి.