సింగర్ సునీత తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.అయితే తాజాగా ఈమె రెండవ వివాహం చేసుకుని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు.
మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఒంటరిగా గడిపారు.అయితే ప్రస్తుతం తన పిల్లల అంగీకారంతోనే రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.
ఈ క్రమంలోనే డిజిటల్ మీడియా ఓనర్ అయిన రామ్ వీరపనేని అనే వ్యక్తితో జనవరి 9న అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.
సునీత తన రెండవ పెళ్లి విషయం గురించి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
ఈమె పెళ్లి గురించి పలువురు తీవ్ర విమర్శలు చేశారు.అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా తన లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తూ సునీత పెళ్లి విషయంలో ఈ విధంగా వ్యవహరించిందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం సునీత రెండవ భర్త రామ్ సునీత పిల్లల బాధ్యత కూడా తానే తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సునీతకు తన పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్న రామ్, సునీతకు కూడా తెలియకుండా మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చాడు.
రామ్ తన పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ చూసి సునీతతో పాటు తన పిల్లలు కూడా ఎంతో ఆనందపడ్డారు.
రామ్ కు డిజిటల్ మీడియా సంస్థలు ఉండడంతో అతనికి ఆస్తి బాగా ఉంది.
అయితే తన ఆస్తిలో భాగంగా కొంత భాగాన్ని సునీత పిల్లలకు రాసి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా తన బిజినెస్ లో భాగస్వామ్యం చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి తెలిసిన సునీత తన పిల్లలు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు.సునీతను పెళ్లి చేసుకున్న తర్వాత వారి పిల్లల బాధ్యత కూడా తానే తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయం గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు రామ్ ను అభినందిస్తున్నారు.