ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.
పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని లింగుస్వామి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యారు.
అయితే ఇప్పుడు ఉన్నపళంగా మళ్ళీ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తం స్క్రిప్ట్ చూసిన తర్వాత రామ్ కథలో ఇంకా బెటర్మెంట్ కావాలని కోరినట్లు తెలుస్తుంది.
లింగుస్వామి ఈ మ్ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు చేయలేదు.అలాగే తెలుగు నేటివిటీ గురించి అవగాహన్ తక్కువగా ఉంటుంది.
ఈ నేపధ్యంలో సినిమా కంటెంట్ పరంగా తమిళ స్టైల్ ఎక్కువగా ఉండటంతో నేటివిటీ కోసం మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక హీరో రామ్ కూడా స్క్రిప్ట్ వర్క్ లో భాగం అయినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రెడ్ సినిమాతో ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్న ఈ కుర్ర హీరో తన నెక్స్ట్ సినిమాల విషయంలో వీలైనంత కేర్ ఫుల్ గా బెస్ట్ కథలతో, కొత్తదనం ఉన్నవాటిని ట్రై చేస్తూ వెళ్లాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే ఇప్పుడు లింగుస్వామి స్క్రిప్ట్ లో తాను కూడా ఇంవాల్ఫ్ అయ్యి రైటర్ అవతారం ఎత్తినట్లు బోగట్టా.
అన్ని సెట్ అయితే ఏప్రిల్ నుంచి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య అనిల్ రావిపూడి చెప్పిన ఒక కథకి కూడా రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.