యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో రామ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే పూర్తి చేశాడు.రెడ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.
వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు భారీ డీల్ వచ్చినట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో సినిమాకు పెట్టిన బడ్జెట్ పూర్తిగా వచ్చేసిందట.దీంతో ఈ సినిమాను ఏది ఏమైనా థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని రామ్ భావిస్తున్నాడు.
దీంతో ఓటీటీ డీల్కు రామ్ నో అని చెప్పేశాడట.ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకని పలువురు ఆలోచిస్తుండగా, అసలు విషయం తెలిసినవారు రామ్ నిర్ణయం సరైనదే అని అంటున్నారు.
ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేస్తే వచ్చేది మొత్తం లాభమే.దీంతో ఈ సినిమాను థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని రామ్తో పాటు చిత్ర యూనిట్ కూడా ఫిక్స్ అయ్యింది.
మరి థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడో, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడో చూడాలి.