ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరో రామ్ మళ్ళీ క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ దర్శకుడు తన గత సినిమాల తరహాలో కాకుండా ఈ సారి రామ్ లో కాస్తా మాస్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ సినిమా రెడ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఓ పాటని డోలమైట్స్ ప్రాంతంలో సముద్రతీరానికి పదివేల అడుగుల ఎత్తుల మైనస్ ఐదు డిగ్రీల చలిలో చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.దీనికి తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేశారు.ఫిబ్రవరి 28న సాయంత్రం ఐదు గంటలకి ఈ సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమాలో నివేదా పేతురాజ్ మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇందులో రామ్ కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇక ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ తో జోష్ మీద ఉన్న రామ్ మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.