యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే రామ్ ఈ సినిమాతో మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
రెడ్ అనే టైటిల్తో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవ్వగా, లాక్డౌన్ కారణంగా అది వాయిదా పడింది.ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో అనే పరిస్థితి నెలకొనడంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
ఇక ఈ క్రమంలో రెడ్ చిత్రానికి పలు ఓటీటీల నుండి మంచి ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయి.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని చిత్ర యూనిట్ అంటోంది.ఇక రామ్ పోతినేని కూడా ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ నుండి రెడ్ చిత్రానికి భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.కానీ ఈ ఆఫర్ను రామ్ తిరస్కరించాడని, ఈ సినిమాను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్కు సూచించినట్లు తెలుస్తోంది.
ఇలా ఓటీటీ ఆఫర్లకు రెడ్ సిగ్నల్ వేస్తూ వస్తున్న రామ్, ఈ సినిమా థియేటర్లలో పక్కా హిట్ కొడుతుందని పూర్తి ధీమాగా ఉన్నాడట.మరి రామ్ నమ్మకం ఎంతమేరకు నెరవేరుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.