యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.ఈ సినిమాతో గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్, తన సక్సెస్ ఆకలిని తీర్చుకున్నాడు.
అటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఈ సినిమాతో అదిరిపోయే విధంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు ఈ హీరో.
తొలిసారి డ్యుయెల్ రోల్ చేస్తూ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రామ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.
కాగా ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచన చిత్ర యూనిట్కు లేనది తెలుస్తోంది.
థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవని, అవి తెరుచుకున్నా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు పెద్ద సంఖ్యలో రారని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో ఈ సినిమాను పరిస్థితులు చక్కబడ్డాక సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగి వచ్చేసింది.
దీంతో సినిమా రిలీజ్ తరువాత రాబోయేది మొత్తం లాభమే కావడంతో ఆలస్యమైనా కూడా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్, నివేథా పేతురాజ్, హెబ్బా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.