జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కేవీ.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించిన అనుదీప్ కి ఊహించని స్థాయిలో హిట్ దొరికింది.
ఓ విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పాలి.ఇక ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కూడా ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.
సినిమాని కొన్న బయ్యర్లకి కూడా భారీ లాభాలు తెచ్చి పెట్టింది.ఇదిలా ఉంటే అనుదీప్ నెక్స్ట్ సినిమా కూడా వైజయంతీ బ్యానర్ లోనే చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే తన దగ్గర మూడు కథలు ఉన్నాయని వాటిలో ఒకటి స్టార్ట్ చేస్తానని కొద్ది రోజుల క్రితం ఈ దర్శకుడు చెప్పిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ కుర్ర దర్శకుడు తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి ఓ కథ చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక రామ్ కి కూడా కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమని చెప్పినట్లు తెలుస్తుంది.ప్రస్తుతానికి అయితే అనుదీప్ చెప్పిన కథపై రామ్ సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక కృతి శెట్టి హీరోయిన్ గా ఖరారైంది.
మరి అనుదీప్ నెక్స్ట్ సినిమాని రామ్ ఒకే చెబుతాడా లేదా అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.