ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రెండు వారాల క్రితం వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
సినిమా అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.ముఖ్యంగా నైజాం ఏరియాలో డియర్ కామ్రేడ్కు ఏమాత్రం ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఫుల్గా దూసుకు పోతుంది.
ఇలాంటి సమయంలో సక్సెస్ వేడుకల్లో రామ్ కనిపించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
సక్సెస్ టూర్లో పూరి, ఛార్మి ఇతర హీరోయిన్స్ మాత్రమే పాల్గొంటున్నారు.ఎందుకు చిత్రం ప్రమోషన్లో రామ్ కనిపించడం లేదు, పార్టీల్లో రామ్ ఎందుకు కనిపించడం లేదు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ చిత్రం యూనిట్ సభ్యులతో రామ్కు చెడిందా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.
అయితే అవిన్ని పుకార్లే అని తాజాగా రామ్ క్లారిటీ ఇచ్చాడు.మొన్నటి వరకు అమెరికాలో ఉన్న రామ్ వచ్చి రాగానే యూనిట్ సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నాడు.
ఆ సందర్బంగా బీర్ పొంగించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ ముందుగా అనుకున్న కారణంగా అమెరికాకు వెళ్లాడని, ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రామ్ అమెరికా వెళ్లాడు తప్ప చిత్ర యూనిట్ సభ్యులతో ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇక రామ్ వారం రోజుల పాటు చిత్రం ప్రమోషన్లో జోరుగా పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.రామ్ మరియు పూరికి చాలా ఏళ్ల తర్వాత మంచి సక్సెస్ పండింది.
అందుకే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని ఇద్దరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.