దృశ్యం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.మలయాళం లో వచ్చిన ఈ చిత్రం ఎన్ని రికార్డు లను సొంతం చేసుకుందో తెలిసిందే.
ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అవ్వడం తో దాదాపు అన్నీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసి విజయాలను అందుకున్నారు.అయితే అసలు మలయాళంలో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించారంటే జీతూ జోసఫ్.
జీతూ జోసఫ్ దర్శకత్వం లో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన దృశ్యం చిత్రం రికార్డులను నెలకొల్పింది.అలాంటి రికార్డులను నెలకొల్పిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానున్నట్లు తెలుస్తుంది.
మోహన్ లాల్ కు జోడీ గా ఈ చిత్రంలో అందాల తార త్రిష నటిస్తుంది.అలానే ఈ చిత్రానికి రామ్ అన్న టైటిల్ ను ఖరారు చేయడం తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
అయితే దృశ్యం తరువాత చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకులు కూడా చాలా అంచనాలను నమోదు చేసుకున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం ఎన్ని రికార్డులను సృష్టించిందో మరి మరోసారి అదే కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల అంచనాలు కూడా మిన్నంటుతున్నాయి.
మరి ఎలాంటి హిట్ ని ఈ రామ్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే కొద్దీ కాలం ఆగాల్సిందే.ఈ చిత్రం కూడా దృశ్యం చిత్రం లాగా ఇతర సినిమా ఇండస్ట్రీలను ఆకట్టుకుంటుందో లేదంటే మలయాళ ఇండస్ట్రీ లోనే నిలిచిపోతుందో చూడాలి.