రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తాడో వర్మకే తెలీదు.అలానే గతంలో అందరి బయోపిక్స్ రామ్ గోపాల్ వర్మ తీస్తుంటే.
రామ్ గోపాల్ వర్మ అనే బయోపిక్ ని తీస్తున్నారు.అలానే దర్శకుడు వీరు.
కే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటించాడు.ఆర్లిన్, డి.ఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ కీలక పాత్రల్లో నటించారు. ఇంకా అలాంటి ఈ సినిమాను ఏటిటిలో విడుదల చెయ్యనున్నారు.లాక్ డౌన్ లో అందరూ ఏటిటీలలో సినిమాలు విడుదల చేస్తే రామ్ గోపాల్ వర్మ మాత్రం సరికొత్త బిజినెస్ గా ఏటిటిలో సినిమాలు రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే చిత్రాన్నే ఊర్వశి ఓటీటీలో విడుదల చేస్తున్నాడు ఇక ఈ సినిమాను చూసేందుకు అసలు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఈ సినిమా చూడొచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్నీ వెల్లడించిన దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ.”ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న ‘ఊర్వశి ఓటిటి’ ఇనాగురల్ ఆఫర్గా ‘రామ్ లోపాల్ వర్మ’ చిత్రాన్ని స్ట్రీమ్ చెయ్యడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు దర్శకుడు చెప్పారు.అంతేకాదు.ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఓ రేంజ్ కి తీసుకెళ్లిన రామ్ గోపాల్ వర్మ ఆతర్వాత అతనే పాతాళానికి తొక్కేస్తున్నాడు అనే బాధతో.ఇకనైనా వర్మ మారాలి అనే ఆశతో ఈ సినిమాను రూపొందించినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.మరి ఈ సినిమాపై వర్మ కామెంట్ ఏంటో చూడాలి.
ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ చిత్రం అంటే కచ్చితంగా కొంచం కొత్తగానే ఉంటుంది.అందులో ఎలాంటి సందేహం లేదు.