యంగ్ హీరో రామ్కు చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్తో సాలిడ్ సక్సెస్ను దర్శకుడు పూరి జగన్నాధ్ ఇచ్చిన విషయం తెల్సిందే.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమాతో రామ్ మరియు పూరి మళ్లీ బిజీ అయ్యారు.
నిర్మాతగా పూరి లాభాల బాట పట్టాడు.ఆసినిమా ఇచ్చిన కిక్తో వరుసగా పూరి సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం రామ్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది.అయితే పూరి కోసం రొమాంటిక్ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడు.
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.చాలా బడ్జెట్ ఖర్చు చేసి మరీ పూరి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో పూరి అడిగాడని రామ్ ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ను చేసేందుకు ఒప్పుకున్నాడట.
రామ్ గెస్ట్ అప్పియరెన్స్తో రొమాంటిక్ సినిమా స్థాయి పెరిగి పోవడం కన్ఫర్మ్ అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మెహబూబా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి ఇప్పటి వరకు సక్సెస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు.రెండవ ప్రయత్నంతో అయినా ఈయన సక్సెస్ అవుతాడో చూడాలి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ జరుగుతోంది.
రొమాంటిక్ ఐటెం సాంగ్లో రామ్ను చూపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.రామ్ ఎంట్రీతో ఆ ఐటెం సాంగ్ మరింత మాస్ అవ్వడం కన్ఫర్మ్.
వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు.