వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.ఈ చిత్రంను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక వైపు ఈ సినిమా తమకు వ్యతిరేకంగా ఉంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు.అలాగే ఈ సినిమా పలు ప్రజా సంఘాలకు వ్యతిరేకంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు సినిమాను వర్మ అనుకున్న సమయంకు విడుదల చేయగలడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సినిమా పూర్తిగా కులాలను రాజకీయ పార్టీలను బేస్ చేసుకుని తెరకెక్కించాడు.కులాల మద్య వివాదం సృష్టించేలా ఉంది.
వర్మ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తీశాడు.కాని కులాలు మరియు మతాల కారణంగా వివాదం అయితే రాలేదు.
మొదటి సారి వర్మ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.ఈ నేపథ్యంలో వర్మ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
భారీ ఎత్తున అంచనాలున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు ఏపీలో పూర్తిగా వైకాపా మద్దతు తెలుపుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో పవన్ మరియు చంద్రబాబు నాయుడు లోకేష్లను వర్మ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.
అందుకే తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు ఈ సినిమాపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే అంత నాకు పబ్లిసిటీ అంటూ వర్మ మొండిగా ముందుకు పోతున్నాడు.
వర్మ ఎలాగైనా సినిమాను విడుదల చేసి తీరుతాడంటూ ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.