ఎప్పుడూ ఏదో వివాదంలో మునిగి తేలుతూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తాజాగా ఆర్జీవీ దర్శకత్వం వహించిన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” చిత్రం పెద్దగా ఆడకపోగ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అదే ఎప్పుడు సినీ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంది ఉండే ఆర్జీవి ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా మాఫియా డాన్ అయినటువంటి దావూద్ ఇబ్రహీం పై కూడా ఇదేవిధంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా ఆర్జీవీ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు 50 కోట్ల రూపాయలు ఇచ్చారని అంతేగాక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కూడా మరో 15 కోట్లు ఇచ్చాడని చెప్పాడు.
అంతేగాక వాళ్ళే తమ ప్రధాన ఫైనాన్షియర్స్ అని కూడా అన్నాడు. దీంతో కంగుతిన్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.అంతేగాక భవిష్యత్తులో తాను చేపట్టే కార్యచరణ గురించి కూడా చెప్పుకొచ్చారు.ఇందులో భాగంగా ఇప్పటికే తాను మూడు చిత్రాలను మరియు మూడు వెబ్ సిరీస్ లు పై దృష్టి సారించినట్లు తెలిపారు.
ఇందులో ఒకప్పుడు హైదరాబాద్ ని గడగడలాడించిన నయీమ్ మరియు శశికళ ల బయోపిక్ లు తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇది ఇలా ఉండగా ఈయన దర్శకత్వం వహించిన ఇటువంటి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ పాత్ర తనను కించ పరిచే విధంగా చిత్రీకరించారంటూ అందుకుగానూ అప్పట్లో కెఏ పాల్ రామ్ గోపాల్ వర్మ పై పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై స్పందించిన రాంగోపాల్ వర్మ అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు చిత్రంలో తాను ఎవరినీ ఉద్దేశించి తీయలేదని అది ఒక రాజకీయ సెటైరికల్ చిత్రమని కావాలంటే తానే కెఏ పాల్ పై పరువు నష్టం దావా వేస్తానని వర్మ తెలిపారు.
.