ఏ అంశం మీద అయిన వివాదాస్పదంగా మాట్లాడటం లేదంటే కాస్తా ఎటకారం జోడించి తనకి నచ్చినట్లు కామెంట్స్ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసుకోవడంలో స్టార్ దర్శకుడు, తరుచుగా ఏదో ఒక వివాదంతో సహవాసం చేసే వ్యక్తి ఆర్జీవీ తాజాగా కరోనా వైరస్ పై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ప్రపంచ దేశాలని భయపెట్టి దేశంలో కూడా మెల్లగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కి సంబందించిన పోజిటివ్ కేసులు మన హైదరాబాద్ కూడా బయట పడటంతో అందరూ కలవరపడుతున్నారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అతను ట్వీట్ తో ఏకంగా కరోనా వైరస్ కి వార్నింగ్ ఇచ్చి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చాడు.
డియర్ కరోనా వైరస్ మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్తున్నావ్.అలా చంపుకుంటే వెళ్లే బదులు ఒక విషయం గురించి తెలుసుకో.నీవు ఒక పరాన్నజీవివి.నువ్వు సోకితే మాతో పాటే నువ్వు కూడా చస్తావ్.
నీవు నా మాటలను నమ్మకపోతే వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో.నీకు నా విన్నపం ఏమిటంటే బతుకు… బతికించు.
నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కరోనాపై ఆర్జీవీ ట్వీట్ చేశాడు.ఆర్జీవీ ట్వీట్కు పలువురు వీరాభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు చిత్ర విచిత్రాలుగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే కొంత మంది ఈ వైరస్ కారణంగా భయపడుతున్న చాలా మంది మాత్రం కరోనాకి అంత సీన్ లేదు అన్నట్లుగా ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు.