ఎప్పుడు ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేటువంటి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా జనాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్నటి రోజున 14 గంటలపాటు ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఈ కర్ఫ్యూలో పాల్గొన్న టువంటి ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి తన మద్దతు బాగానే తెలియజేశారు.
అయితే ఇందుకుగాను నిన్నటి రోజున సాయంత్రం ఐదు గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కూడా కొట్టారు.
అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడానికి కోసం ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి.
నిన్నటి రోజున కర తాళధ్వనులతో సంఘీభావం తెలిపిన టువంటి ప్రజలు ఈరోజు రోడ్లపై యధావిధిగా సంచరించడం ప్రారంభించారు.ఈ విషయంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ నిన్నటి రోజున అందరూ జనతా పార్టీకి మద్దతు తెలిపిన వారు ఇవాళ అన్నీ మర్చిపోయి యధావిధిగా రోడ్లపై సంచరిస్తున్నారు ఇదే మనభారతీయుల తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయంలో పలువురు స్పందిస్తూ రోజంతా నిర్భంధంలో ఉంటే ఇంటికి కావలసినటువంటి కనీస అవసరాలు ఎలా తీరుతాయి అంటూ ప్రశ్నిస్తున్నారు.అంతేగాక మీలాంటి డబ్బున్న వ్యక్తుల అయితే ఇంట్లో ఉంటే చెల్లుతుందని తమ లాంటి సామాన్య ప్రజలు రోజులో కచ్చితంగా ఒక్కసారైనా బయటికి రాక తప్పదని అంటున్నారు.అయితే ఇటీవలే ఈ విషయంపై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా స్పందించాడు.ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దంటూ ప్రజలకి సూచించాడు.