బాలీవుడ్ లో గత ఏడాది యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.కేవలం డిప్రెషన్ కరణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తేల్చేసిన కూడా దాని వెనుక ఇంకేదో మిస్టరీ ఉందని చాలా మంది నమ్ముతున్నారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తల్లిదండ్రులు కూడా చెప్పడం విశేషం.అతని ఆత్మహత్యకి బలమైన కారణాలు ఉండే ఉంటాయని, ఎవరో కావాలనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఉంటారని కూడా ఆరోపణలు చేశారు.
కంగనా రనౌత్ అయితే సుశాంత్ సింగ్ కి బాలీవుడ్ లో చాలా అవమానాలు ఎదురయ్యాయని, ఏకంగా అతనిని అరడజను సినిమాల నుంచి చివరి నిమిషంలో తప్పించారని, నెపోటిజం కారణంగా సుశాంత్ చాలా అవకాశాలు కోల్పోయాడని విమర్శలు చేసింది.ఏది ఏమైనా సుశాంత్ మరణం అనేది బాలీవుడ్ లో ఒక మిస్టరీగానే ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే సుశాంత్ జీవిత కథతో కొంత మంది సినిమాలు స్టార్ట్ చేశారు.ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కూడా సుశాంత్ బయోపిక్ పై దృష్టి పెట్టాడు.
సుశాంత్ సింగ్ జీవితంపై సినిమా తెరకెక్కించేందుకు ఆర్జీవీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమాలో సుశాంత్ లవ్ స్టోరీ మొదలు సినీ పరిశ్రమలో నెలకొన్న రాజకీయాలు డ్రగ్స్ వంటి అంశాలను కూడా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
సుశాంత్ మరణం తర్వాత ఆ హీరో జీవితం ఆధారంగా సినిమా నిర్మిస్తానని గతంలోనే ఆర్జీవీ ప్రకటించాడు.కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సుశాంత్ పాత్ర కోసం ఓ థియేటర్ ఆర్టిస్ట్ ని ఫైనల్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.