టాలీవుడ్ లో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఉన్నది ఉన్నట్లుగా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం రామ్ గోపాల్ వర్మ యొక్క స్పెషాలిటీ.
అయితే ఆయన తెరకెక్కించే చిత్రాలు కూడా అంత వైవిధ్యభరితంగా ఉంటాయి.అయితే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు.
అంతేగాక నిత్యం ఏదో ఒక సమస్య పై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ గురించి చేసినటువంటి ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇందులో ఎవరో ఒక వ్యక్తి భార్య ఈ కరోనా వైరస్ ని భూమి మీదకు పంపించమని కోరినట్లు తనకు అనుమానంగా ఉంది అంటూ ట్వీట్ చేసాడు.అంతేగాక ఇందుకు కారణాలు వివరిస్తూ అనునిత్యం మగాళ్లు ఎక్కువ సమయం తన భార్యలతో గడపకుండా బార్లు, పబ్బులు, మందు, ఆఫీస్ అంటూ బయట బయటనే గడుపుతున్నారని అందువల్లనే ఎవరో ఒకరి భార్య దేవుడిని ఇలా కరోనా వైరస్ ని పంపించమని కోరుకున్నట్లు తనకు అనుమానం ఉందని పేర్కొన్నాడు.
అంతేకాక ఇప్పుడు ప్రస్తుతం మనకు వేరే ఆప్షన్ లేదని, కేవలం మీ భార్యతో హ్యాపీగా ఉండడమే ఒకే ఒక ఆప్షన్ అంటూ తెలిపాడు.అలాగే రాంగోపాల్ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ కి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అంతేకాక 21 రోజులు ఇంటికే పరిమితం కావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటూ మరో పక్క మద్యం దుకాణాలు కూడా మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఏదేమైనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కి భయపడుతుంటే మన వాళ్లు మాత్రం కరోనా వైరస్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తూ సరదాగా నవ్వుకుంటూ గడిపేస్తున్నారు.