సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ గోపాల్ వర్మ తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు.
అందువల్లనే రామ్ గోపాల్ వర్మ నేటితరం యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అయితే తాజాగా అల్లు వారి హీరో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో షేర్ చేసినటువంటి ఓ ఫోటో పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ “ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు.అల్లు అరవింద్ కొడుకు.అల్లు సార్.మీకు జోహార్” అంటూ అల్లు శిరీష్ ఫోటోని షేర్ చేశాడు.
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మాధ్యమాలలో రామ్ గోపాల్ వర్మ మరో మరో హాట్ టాపిక్ గా మారాడు.దీంతో కొందరు అల్లు శిరీష్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ పై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ “ఢీ” కంపెనీ అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు.ఈ వెబ్ సిరీస్ ని స్పార్క్ ఓటిటి లో విడుదల చేయగా మంచి స్పందన లభించింది.
ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే ఆ మధ్య “ఏబిసిడి” అనే చిత్రంలో హీరోగా నటించాడు.కానీ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దాంతో అప్పటి నుంచి అల్లు శిరీష్ తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.