ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల వ్యవహారం పై యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లపై వర్మ గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని, వర్మ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగిందని చెప్పాలి.ఇక ఈ వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మంత్రి పేర్ని నాని వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చి అతనితో కలిసి సంప్రదింపులు చేశారు.
వర్మ మంత్రి భేటీ అనంతరం ఈ వివాదాన్ని ఇంతటితో పులిస్టాప్ పడుతుందని అందరూ భావించారు.అలా అందరూ భావించిన విధంగా సైలెంట్ అయితే వర్మ స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి.
ఎవరు ఊహించని విధంగా మరో సారి వర్మ టికెట్ల వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కట్టప్పను ఎవరు చంపారు? అంటూ మరోసారి మొదలుపెట్టారు.
ఇలా కట్టప్పని ఎవరు చంపారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాకు ఉత్తరాది రాష్ట్రాలలో సుమారు 2200/- టికెట్ ధరలు ఉంటే సొంత రాష్ట్రమైన ఏపీలో మాత్రం 200 రూపాయలకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఈ విషయంపై వర్మ స్పందిస్తూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.