వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసినా వివాదం రేగడం ఆనవాయితీగా మారిపోయింది.దీంతో వర్మ ఎప్పుడు ఎలాంటి సినిమాతో వస్తాడా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన వర్మ, ఈ సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు.
ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి ఉండటంతో పవన్ ఫ్యాన్స్ వర్మపై మండిపడుతున్నారు.తమ అభిమాన హీరో గురించి వర్మ ఎలా తీస్తాడా అని వారు ఈ సినిమాను రిలీజ్ కాకుండా చేయాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే వర్మ ఆఫీస్పై కొంత మంది అభిమానులు దాడి కూడా చేశారు.అయితే ఈ దాడితో వర్మ మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని మెగా ఫ్యామిలీపై తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ను పట్టాలెక్కించేందుకు వర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
కెరీర్లో వరుస విజయాలను అందుకుని ఆ తరువాత ఫేడవుట్ దిశగా వెళ్లిన ఉదయ్ కిరణ్, సినిమా ఛాన్సులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఉదయ్ కిరణ్ సూసైడ్కు మెగా ఫ్యామిలీ హీరోలే కారణమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది.
ఇప్పుడు ఇదే అంశాన్ని తన సినిమాలో చూపించేందుకు వర్మ రెడీ అవుతున్నాడట.మరి వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.