వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు నెలల క్రితం వరుసగా సినిమాలను విడుదల చేశాడు.ఆ సమయంలో ప్రతి శుక్రవారం సినిమాను విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చాడు.
అది ఎలాంటి సినిమా అయినా వారం వారం వస్తుందని చెప్పడంతో అంతా ఆసక్తిని వ్యక్తం చేశారు.అయితే తాజాగా వర్మ సినిమాల హడావుడి లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
వర్మ ఇప్పటికే నాలుగు అయిదు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ వర్మ చకచక పూర్తి చేసి వారం పది రోజుల్లో వ్యవధిలో విడుదల చేస్తాడని అనుకుంటే నెల రోజులుగా ఆయన నుండి సినిమా రాలేదు.
ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా అంటూ ‘దిశ ఎన్ కౌంటర్’ అంటూ ప్రకటించాడు.ఆ సినిమా విషయంలో ఏం జరుగుతుందో అప్డేట్ ఇవ్వడం లేదు.
రామ్ గోపాల్ వర్మ గత నెల రోజులుగా కాస్త సైలెంట్గా ఉంటున్నాడు అనిపిస్తుంది.సంచల వ్యాఖ్యలు లేవు.సినిమాలకు సంబంధించి అప్ డేట్ లేదు.కరోనా కారణంగా వర్మ కూడా కాస్త డల్ అయ్యాడా అంటూ ఆయన అభిమానులు స్వయంగా గుసగుసలాడుకుంటున్నారు.
వర్మ కొత్త సినిమాలు వరుసగా డిజిటల్ ఫార్మట్లో విడుదల అయితే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.వారు సినిమాలకు భారీ మొత్తం చెల్లించి అయినా చూసేందుకు రెడీగా ఉన్నారు.
కాని వర్మ మాత్రం తన కొత్త సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటించడం లేదు.దిశ సినిమాను మాత్రం నవంబర్ లో విడుదల చేస్తాను అన్నాడు.
షూటింగ్ వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వర్మ విడుదల చేస్తాడు కనుక ఆ సినిమాకు వచ్చిన అనుమానం లేదు.కాని ఇతర సినిమాలు ఇప్పటికే ప్రకటించినవి ఎప్పుడు విడుదల చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
రామ్ గోపాల్ వర్మ ఇకపై థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు తీయడా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాని వర్మ మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్లోనే సినిమా తీయాలని భావిస్తున్నాడట.
త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది.వేటికి అవే అన్నట్లుగా వర్మ సినిమాలు చేస్తూనే ఉంటాడు.