వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం ఆయనకు వెన్నెతో పెట్టిన విషయం.ఈ దర్శకుడు తెరకెక్కించే ప్రతి సినిమా వివాదాలకు కేరాఫ్గా నిలుస్తుంటాయి.
ఇటీవల వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.కాగా తాజాగా వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మరో వివాదాస్పద చిత్రం తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాతో ఏపీ రాజకీయాల్లో వర్మ మరో సంచలనానికి తెరతీస్తున్నాడని సినీ వర్గాలు తెలిపాయి.కాగా వర్మ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టి తన సత్తా మరోసారి చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
వర్మ తన నెక్ట్స్ సినిమాను జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్తో కలిసి మరో సంచలనాత్మక చిత్రానికి తెర లేపాడు.తన దర్శకత్వంలో తదుపరి చిత్రంగా దాదాస్ ఆఫ్ హైదరాబాద్ అనే సినిమా రానున్నట్లు వర్మ తెలిపాడు.
జార్జి రెడ్డి సినిమాను తాను తిలకించినట్లు, ఆ సినిమా తనకు భీబత్సంగా నచ్చినట్లు వర్మ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో నటించిన సందీప్ మాధవ్తో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని, అది హైదరాబాదీ దాదాలను బేస్ చేసుకుని ఉంటుందని వర్మ చెప్పుకొచ్చాడు.
దీంతో ఆంధ్రా, రాయలసీమ తరువాత వర్మ హైదరాబాద్ దాదాలపై పడ్డాడని స్పష్టం అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి.