టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తాడు.ఇప్పటికే కరోనా పేరుతో ఓ సినిమాను రిలీజ్కు రెడీ చేసిన వర్మ, యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘మర్డర్’ చిత్రాన్ని కూడా రిలీజ్కు రెడీ చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యను ఆధారంగా చేసుకుని వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
అయితే ఈ సినిమాను వేసవిలో మొదలుపెట్టిన వర్మ, అప్పుడే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూశాడు.కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది.
ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని వర్మ పలుమార్లు చెబుతూ వచ్చాడు.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్కు సంబంధించి వర్మ క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాను నేరుగా థియేటర్లలో డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ముగించేసుకుందని, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేశారని వర్మ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేయగా, నట్టి క్రాంతి, నట్టి కరుణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి తెలంగాణలో సంచలనం సృష్టించిన అమృత-ప్రణయ్ల కేసును వర్మ ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే మర్డర్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
కాగా ఈ సినిమా రిలీజ్ను నిలిపివేయాలంటూ ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.