తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే.కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఈనెల 25 వ తారీఖున ఆన్ లైన్ ద్వారా విడుదల చేశాడు.
అయితే ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత రాజకీయ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు.దీంతో అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ ఒక చూపించబోతున్నాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేగాక “పవర్ స్టార్” చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో నినాదాలు కూడా చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేశారు.అయితే ఈ చిత్రం విడుదలయిన తర్వాత మాత్రం కొంత మంది అభిమానులు పవర్ స్టార్ చిత్రం లో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గురించి వాస్తవాలనే చూపించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక ట్రైలర్ చూసి మొదట్లో ఈ చిత్రం గురించి కొంతమేర తప్పుగా అనుకున్నప్పటికీ వర్మ మాత్రం ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడని అంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఓ వాస్తవిక సంఘటన ఆధారంగా “మర్డర్” అనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.