టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏదో ఒక విషయం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఎన్నో వివాదాలను సృష్టించే రామ్ గోపాల్ వర్మ నిన్నటి వరకు ఏపీ టికెట్ల వ్యవహారం పై తీవ్రస్థాయిలో స్పందిస్తూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ సీనియర్ నటికి 50 వేల రూపాయలు అప్పు ఉన్నట్లు సదరు నటి ఒక టీవీ షోలో తెలిపారు.అసలు వర్మ ఎవరికి అప్పు ఉన్నారు అనే విషయానికి వస్తే…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మహేశ్వరి తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఇక దెయ్యం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రాంగోపాల్ వర్మ తనతో ఒక చాలెంజ్ చేశారని మహేశ్వరి చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దెయ్యం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా షూటింగ్ మేడ్చల్లోని రాంగోపాల్ వర్మ ఫామ్ హౌస్ మెయిన్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో చిత్రీకరించినట్లు తెలిపారు.అయితే అక్కడ ఒక స్మశాన వాటికను ఏర్పాటు చేశారని ఎవరైనా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఇటువైపు వస్తే వారికి 50 వేలు ఇస్తానని చెప్పినట్లు తెలిపారు.అలా అతను చెప్పడంతో నేను స్మశానవాటికకు వెళ్లానని అయితే వర్మ గారు ఇప్పటి వరకు 50 వేల రూపాయలు తనకు ఇవ్వలేదని ఈ సందర్భంగా మహేశ్వరి తెలిపారు.