మీటూ ఉద్యమంతో బాలీవుడ్ అతలాకుతలం అవుతున్న విషయం తెల్సిందే.ఎంతో మంది దర్శకులు మరియు నిర్మాతలు పెద్ద ఎత్తున లైంగిక వేదింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మపై మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరు చిన్న కామెంట్ కూడా చేయలేదు.
ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వర్మ గురించి ఇండస్ట్రీలో బ్యాడ్ టాక్ ఉంది.ఆయన అమ్మాయిలను వాడుకుంటాడు అంటూ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు.
మరి అలాంటి వర్మ గురించి షాకింగ్ గా ఇప్పటి వరకు లైంగిక వేదింపుల ఆరోపణలు రాకపోవడం కొందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది.
తాజాగా వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవ గీత’ చిత్రం భారీ అంచనాల నడుమ కన్నడ మరియు తెలుగులో విడుదలకు సిద్దం అయ్యింది.ఈ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన వర్మ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.మీటూ ఉద్యమంలో భాగంగా మీ పేరు రాలేదు కదా అందుకు మీ స్పందన ఏంటని విలేకరి ప్రశ్నించిన సమయంలో విచిత్రమైన సమాధానం చెప్పి అందరిని నవ్వించాడు.
మీలాగే చాలా మంది నా పేరు మీటూలో రాలేదు ఎందుకో అంటూ అనుకుంటున్నారు.కొందరు అయితే నా పేరు రాకపోవడంతో షాక్ కూడా అవుతున్నారు.నేను పొద్దుల లేస్తే తొడల గురించి మాట్లాడతాను, జీఎస్టీ వంటి అత్యంత బూతు సినిమాలు తీస్తాను.అయినా కూడా నా పేరు మీటూలో రాకపోవడం ఆశ్చర్యమే అన్నాడు.
అయితే నన్ను కలిసిన వారు అంతా కూడా నేను ఒక పవిత్రుడిని అంటూ భావిస్తున్నారేమో అంటూ నవ్వేశాడు.వర్మ దర్శకత్వంలో త్వరలోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం పట్టాలెక్కబోతుంది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.