సుశాంత్ మృతి విషయంలో రిపబ్లిక్ టీవీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆ ఛానెల్ అధినేత అయిన అర్నబ్ గోస్వామి బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.బాలీవుడ్ అంటే చెత్త ఇండస్ట్రీ అంటూ ఆయన అభివర్ణించాడు.
బాలీవుడ్లో జరుగుతున్న తప్పులు ఎక్కడ లేవు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.ఆయన పలు ఆసక్తికర విషయాలను జనాల ముందుకు తీసుకు వచ్చాడు.
ఇలాంటి సమయంలో కొందరు బాలీవుడ్ ప్రతినిధులు మరియు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు.రామ్ గోపాల్ వర్మ కూడా అర్నబ్ గోస్వామిపై ఎదురు దాడికి దిగాడు.
అర్నబ్ గోస్వామి ఒక న్యూస్ ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన చేసిన ఎన్నో చెత్త పనులను ఒక సినిమా రూపంలో తీసుకు వస్తానంటూ వర్మ ప్రకటించాడు.
వర్మ ఈమద్య కాలంలో వరుసగా డిజిటల్ చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే.అదే విధంగా అర్నబ్ గోస్వామిపై కూడా డిజిటల్ మూవీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రకటించాడు.
న్యూస్ వేశ్య అయిన అర్నబ్ గోస్వామి బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకు గట్టి సమాధానం చెప్తానంటూ వర్మ ప్రకటన చేసి చాలా రోజు అయ్యింది.మరి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు.
వర్మ ఏదైనా సినిమా అనుకుంటే ఒక్కటి రెండు రోజుల్లోనే పోస్టర్ విడుదల చేయడంతో పాటు వెంటనే చిత్రీకరణ మొదలు పెడతాడు.అలాంటి వర్మ ఇప్పటి వరకు న్యూస్ వేశ్య మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.కనుక అసలు ఆ సినిమా ఉందా లేదా అంటూ ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం వర్మ మర్డర్, థ్రిల్లర్ ఇంకా డేంజరస్ అనే చిత్రాలు చేస్తున్నాడు.ఈ సినిమాలు అన్ని కూడా వివాదాస్పద క్రైమ్ సినిమాలు అంటున్నాడు.వరుసగా సినిమాలు రాబోతున్నాయి.
ఈ క్రమంలో న్యూస్ వేశ్య వస్తుందా లేదా అనేది చూడాలి.