వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘మర్డర్’.మిర్యాలగూడెం లో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే.
ఈ సినిమాకు సంబంధించిన వివాదం హై కోర్టు వరకు వెళ్లింది.మిర్యాలగూడెం కు చెందిన అమృత సినిమా విడుదలపై స్టే విధించాలంటూ కోర్టును కోరింది.
కాని కోర్టు మాత్రం సినిమా విడుదల ను అడ్డుకోలేం అంటూ తీర్పు ఇచ్చింది.దాంతో సినిమా విడుదల అయ్యింది.
వర్మ వెళ్లి ఏకంగా మిర్యాలగూడెంలో ప్రెస్మీట్ పెడుతాను అంటూ ప్రకటించాడు.కాని శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో పోలీసు లు ఆ ప్రెస్ మీట్ కు అనుమతు లు ఇవ్వలేదు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో అందరికి తెల్సిందే.సినిమా విడుదల అవ్వడం.
నెగటివ్ టాక్ దక్కించుకోవడం జరిగింది.ఈ సినిమాకు మొత్తంగా పాతిక లక్షల షేర్ కూడా రాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
థియేటర్ల లో ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంచారు.వర్మ సినిమా ను థియేటర్ల లో జనాలు చూసేందుకు ఇష్టపడలేదు.అయినా వదలకుండా అమెజాన్ ద్వారా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.సినిమాకు కోటి కూడా ఖర్చు అయ్యిందో లేదో కాని సినిమాను మాత్రం భారీగానే పబ్లిసిటీ చేసి మంచి రేటుకు అమ్మేశాడు.అమెజాన్ కు ఈ సినిమాను పే పర్ రేట్ ద్వారా అమ్మేసినట్లుగా తెలుస్తోంది.
ఈ కారణంగానే వర్మకు మరింత లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వర్మ మర్డర్ కు అమెజాన్ లో అయినా ఆదరణ దక్కేనా చూడాలి.