చిన్న పిల్లల నుండి పెద్ద వారికి వరకు ప్రతి ఒక్కరికి కూడా రాముడు ఎక్కడ పుట్టాడు అంటే అయోద్యలో పుట్టాడని అంటారు.అందుకే అయోద్యలో రామమందిరం నిర్మించాలంటూ హిందువులు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.
అయితే అయోద్యలో మసీదు ఉండటం వల్ల అది ముస్లీంలకే చెందుతుంది అని ముస్లీం మత పెద్దలు చెబుతూ వస్తున్నారు.మొత్తానికి సుదీర్ఘ కాలంగా వివాదంగా కొనసాగుతూ వస్తున్న అయోద్య విషయంపై ఎట్టకేలకు ఒక క్లారిటీ రాబోతుంది.
ఈ విషయమై ఇటీవల బాబా రామ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ అయోద్యలో రాముడు జన్మించాడనే విషయం ముస్లీంలతో పాటు ప్రపంచంలోని అందరికి కూడా తెలుసు.
అందుకే అయోద్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలి.వివాదాలన్నీ కూడా సమసిపోయాయి.త్వరలోనే అయోద్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని బాబా రామ్ దేవ్ కోరుకున్నాడు.ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాల కారణంగా అయోద్యలో రామ మందిరం నిర్మాణం స్పీడ్గా జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.