ఎఫ్ఎల్ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసనకు అవార్డు ఇవ్వడం జరిగింది.తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ప్రభావవంతమైన మహిళ అవార్డును ఆమెకు అందజేశారు.
ఈ సందర్భంగా అందుకున్న అవార్డు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన పురుషుల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.భార్య, తల్లి, సోదరి, కూతురు, కోడలు మరియు మనవరాలు జీవితాలలో వెలుగులు నింపే ప్రతి పురుషుడికి ఈ అవార్డు అంకితం అంటూ పేర్కొంది.
సమాజంలో పురుషులు మద్దతు తెలిపిన మహిళా జీవితాలు చాలా సురక్షితంగా మరియు సానుకూల దృక్పథంతో అనేక విజయాలు సాధించడం జరుగుతుంది, అని నేను నమ్ముతాను అంటూ ఉపాసన తన మనసులో మాట అవార్డు అందుకున్న ఆనందంలో కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో వెల్లడి చేసింది.ఉపాసన బయట సామాజికంగా అదేవిధంగా ఆరోగ్యరీత్యా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక చైతన్యవంతమైన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
రోడ్డుపై ఎవరూ పట్టించుకోని మూగజీవాలను చేరదీస్తూ వాటి సంరక్షణ కల్పించడమే కాక చాలా మంది పేద వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించి తనలో ఉన్న మానవత్వాన్ని బయట పెట్టిన సందర్భాలు ఎన్నో.ఇలాంటి కార్యక్రమాలు చేసే ఉపాసన కి అవార్డు రావడం నిజంగా సంతోషకరమైన విషయం అని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.