మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు మంచు విష్ణు.కానీ ఇప్పటి వరకు కెరీర్ లో సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.
ఒకటి రెండు కామెడీ సినిమాలతో హిట్ కొట్టిన మళ్ళీ వరస ప్లాపులతో రేస్ లో వెనుక పడ్డాడు.దీంతో చాలా గ్యాప్ తీసుకుని మంచు విష్ణు మోసగాళ్లు సినిమా చేసాడు.
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది.
ఈ సినిమా మొత్తం ఐటీ స్కామ్ నేపథ్యంలో సాగుతుంది.ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం మార్చి 19 న విడుదల అయింది.
ఈ సినిమాకు రచయితగా కూడా మంచు విష్ణు పని చేసారు.
ఈ సినిమాలో మంచు విష్ణు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.అయితే నిన్న విడుదల అయిన మోసగాళ్లు సినిమా పై రామ్ చరణ్ కామెంట్ చేసారు.చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ లో ఈ రోజు ఒక పోస్టు పెట్టాడు.
ఈ సినిమా పై రెస్పాన్స్ నేను కూడా విన్నానని ఈ త్రిల్లర్ సినిమాను ప్రేక్షకులు తప్పకుండ చూడాలని రామ్ చరణ్ తెలిపాడు.
ఈ సినిమాలో నటించిన మంచు విష్ణు, సునీల్ శెట్టికి విషెష్ తెలిపాడు.
ఈ పోస్టులో కాజల్ అగర్వాల్ ను స్పెషల్ గా మెన్షన్ చేసాడు.ఈ పోస్టును చుసిన విష్ణు రామ్ చరణ్ కు థాంక్స్ చెప్పాడు.
ఉదయం కాల్ చేసి విషెష్ తెలిపినందుకు చాలా ఆనందంగా ఉందని అయన తన పోస్టులో తెలిపాడు.