2020 సంవత్సరం డిసెంబర్ నెల 27వ తేదీన తనకు కరోనా సోకినట్లు స్టార్ హీరో రామ్ చరణ్ కీలక ప్రకటన చేశారు.కొన్ని రోజుల క్రితం చరణ్ కు కరోనా నెగిటివ్ నిర్దారణ అయింది.
ప్రస్తుతం చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.హోం క్వారంటైన్ లో ఉండి చరణ్ కరోనాకు చికిత్స తీసుకున్నారు.
చరణ్ కు కరోనా సోకడంతో పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా ఉపాసన కూడా క్వారంటైన్ లో ఉన్నారు.
తాజాగా ఉపాసన చరణ్ తో కలిసి క్వారంటైన్ లో ఉన్న రోజుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకునే టైమ్ లో తొలి రెండు రోజులు ఇబ్బంది పడ్డామని తెలిపారు.చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత తమ సిబ్బంది గురించే ఎక్కువగా టెన్షన్ పడ్డామని ఉపాసన పేర్కొన్నారు.
చరణ్ కు కరోనా సోకిన విషయాన్ని సిబ్బందికి వెంటనే తెలియజేశామని తెలిపారు.
తాను కరోనా పరీక్షలు చేయించుకున్న సమయంలో నెగిటివ్ నిర్ధారణ అయిందని అయితే పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉండటంతో తాను కూడా చరణ్ తో పాటు క్వారంటైన్ లో ఉన్నానని ఉపాసన పేర్కొన్నారు.ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.వైద్యులు సూచనలు చేసినా తొలి రెండు రోజులు కొంత గందరగోళానికి గురయ్యామని అన్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన ఈ విషయాలను వెల్లడించారు.ఇబ్బందులు ఎదురైతే వాటిని ప్రేమ, అభిమానం, ఆప్యాయతల ద్వారా అధిగమించాలని భావించామని పేర్కొన్నారు.
ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో మా బంధం, సిబ్బందితో తమకున్న అనుబంధం మరింత బలపడిందని ఉపాసన పేర్కొన్నారు.మరోవైపు చరణ్ ఆచార్య సినిమాలో సిద్ధా పాత్రలో నటిస్తుండగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.