ఉపాసన కొనెదల… రామ్ చరణ్ భార్యగా అందరికి పరిచయం అయిన కూడా ఈమె.సొసైటీతో తన వ్యక్తిత్వం ఆలోచనలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ తో ఉన్న ఉపాసన విమెన్ వ్యాపారవేత్తగా ఇప్పటికే సత్తా చాటారు.అయితే వీటితో పాటు ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలకి ముందుండే ఉపాసన ప్రస్తుతం వైల్డ్ లైఫ్ యానిమల్స్ సేవ్ చేయాలని పిలుపునివ్వడంమే కాకుండా తన ఇంటినే వైల్డ్ లైఫ్ మ్యూజియంగా మార్చేసింది.
దీనికి భర్త రామ్ చరణ్ నుంచి కూడా కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె నేటి తరం అమ్మాయిలకి, అలాగే యువతగా స్పూర్తినిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయం పంచుకున్నారు.
నిన్ను నువ్వు ప్రేమించడమే మానవ సంబంధాల్ని బలపరిచేందుకు సంకేతం అని అన్నారు.
మనుషుల మధ్య బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా? అయితే అందుకు కొన్నిటిని ప్రయత్నించాలని తెలిపారు.తొలుత నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నిస్తే ఇతరులను ప్రేమించే సద్గుణం అలవడుతుందని ఉపాసన అన్నారు.
నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో.నీకు సంతోషం కలిగించే పనులు చెయ్.
ఇదే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తుంది అని ఒక గొప్ప విషయాన్ని ప్రభోదించే ప్రయత్నం చేశారు.ఈ మాట ఓ విధంగా చాలా మందికి ఒక మేడిసన్ లా పనిచేస్తుందని చెప్పాలి.
ఈ నేపధ్యంలోనే ఉపాసన చెప్పిన మాతం మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఉపాసనకి ఎంత మంచి వ్యక్తిత్వం ఉందో తెలుసుకోవాలని చెబుతున్నారు.
మొత్తానికి ఉపాసన తన ట్వీట్ తో ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది అని చెప్పాలి.