రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇంటర్వూ ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూలో ఉపాసన మనసు విప్పి మాట్లాడింది.
తన హబీస్ తనకు రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి ఏ సినమాలంటే ఇష్టం అనే విషయాలను బయట పెట్టింది.రామ్ చరణ్ సినిమాల్లో తనకు రంగస్థలం సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
మరియు మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో మీకు ఏ సినిమా ఇష్టం అని యాంకర్ అడగ్గా సైరా నరసింహ రెడ్డి సినిమా తనకు బాగా ఇష్టమని చెప్పింది.
రామ్ చరణ్ హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లలో యాక్ట్ చేసినపుడు మీరు జెలస్ ఫీలవుతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఉపాసన తనదైన రీతిలో జవాబు చెప్పింది.
అందుకు నేనూ ఆడదాన్నే కదా.నాకూ జలస్ ఉంటుంది.జలస్ అనేది లేకపోతే నేను చరణ్ ను లవ్ చేయడం లేదని అర్థం అని చెప్పుకొచ్చింది.చాలా మంది స్టార్లు తనకు మంచి మిత్రులని చెప్పుకొచ్చింది.ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఉపాసన అది నా పర్సనల్ విషయం అని చెప్పేసింది.
యాంకర్ చాలా మంది మీకు పుట్టబోయే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారని మేము మీ నుంచి ఆ వార్తను ఎప్పుడు వింటామని ప్రశ్నించగా.
అది నా పర్సనల్ విషయమని తేల్చి చెప్పింది.ప్రస్తుత భయానక పరిస్థితుల్లో పిల్లలను కనలేమని చెప్పింది.ఇంకా అనేక విషయాలను ఉపాసన తన మనసు విప్పి పంచుకుంది.పిల్లల విషయంలో ఉపాసన రామ్ చరణ్ మీద చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అదే విషయాన్ని ఉపాసన కూడా చెప్పింది.
మీరంతా ఎలాగైనా కామెంట్లు చేసినా తనకు పరవాలేదని ప్రకటించింది.ఎవరూ ఏమనుకున్న తాను పట్టించుకోనని చెప్పింది.ఈ భయానక పరిస్థితులు సద్దుమణిగేదాకా ఉపాసన నుంచి పిల్లలకు సంబంధించిన ఎటువంటి వార్తను మనం వినలేమన్న మాట.