మెగా డాటర్ నిహారిక చైతన్యల వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది.ఆ వివాహ వేడుకలో అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్లు సతీ సమేతంగా పాల్గొన్నారు.
ఈ ఇద్దరు జోడీలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.నిహారిక చైతన్యల కంటే వీరి ఫొటోలను ఎక్కువగా అభిమానులు ట్రెండ్ చేశారు అనడంలో సందేహం లేదు.
అల్లు అర్జున్ స్టైలిష్ లుక్కు అంతా ఫిదా అవ్వగా చరణ్ మరియు ఉపాసన సింపుల్ లుక్కు ఫ్యాన్స్ ప్లాట్ అయ్యాయి.
ఇక ఉపాసన పోస్ట్ చేసిన ఈ ఫొటో మరింత వైరల్ అయ్యింది.
చరణ్ చాలా డీసెంట్గా చేతులు కట్టుకుని ఏదో చూస్తూ ఉండగా ఆయన వెనుక ఉన్న ఉపాసన చాలా చిలిపిగా నవ్వుతూ నా భర్త వెనుకే నేను అన్నట్లుగా నిల్చుని ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.ఒక వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్న ఉపాసన కామినేని ఇలా ఒక సాదారణ మహిళ మాదిరిగా భర్త వెనుక నిల్చుని నా భర్త వెనుకే నేను అన్నట్లుగా క్యూట్ గా నిల్చోవడం అందరికి బాగా నచ్చింది.
ఆ ఫొటోలో తెలియని చిలిపి తనంతో పాటు హుందాతనం ప్రేమ ఆప్యాయత ఇంకా చాలా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.వీరిద్దరి జంట ఈమద్య కాలంలో ఎక్కడ కనిపించినా కూడా అందరు ఆరాధిస్తూనే ఉన్నారు.వీరి జంటకు ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.ఈసారి ఈ జంటకు క్యూట్ క్యూట్ సూపర్ కపుల్ అంటూ కామెంట్స్ ఇస్తున్నారు.