మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 సమయంలో బైక్ పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం సాయి ధరమ్ అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కన్ను, ఛాతి భాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సాయి ధరమ్ ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలియగానే మెగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
అతివేగం కారణంగానే బండి కంట్రోల్ చేయలేక సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైనట్లు తెలుపుతూ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను కూడా విడుదల చేశారు.
ఈ క్రమంలోనే సాయి తేజ్ ను పరామర్శించిన కుటుంబసభ్యులు ఆయన ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.అదేవిధంగా సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తున్నారు.
నిన్న రాత్రి మెగా కుటుంబ సభ్యులు అందరూ సాయిధరమ్ తేజ్ ను పరామర్శించగా తాజాగా రామ్ చరణ్ అతని భార్య ఉపాసన హాస్పిటల్ కు చేరుకున్నారు.అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాయి ధరమ్ ప్రమాదం పై స్పందిస్తూ.త్వరగా కోలుకో సోదర అంటూ ట్వీట్ చేశారు.అదేవిధంగా మెగా అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్ తొందరగా కోలుకొని తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.