టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తో హిట్ కొట్టిన చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.
ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.ఈయన సినిమాల విషయం పక్కన పెడితే.చరణ్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈయన ఇటీవలే నటించి నిర్మించిన ఆచార్య సినిమా భారీ ప్లాప్ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు దాదాపు 70 కోట్ల వరకు నష్టం వచ్చినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
అలా ఆచార్య దెబ్బ తీసిన ఆ దెబ్బ నుండి చరణ్ చాలా నేర్చుకుని ఇప్పుడు జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తున్నాడు.ఈయన ఆర్సీ 15 తర్వాత సినిమాలు కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట.
గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు కానీ ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.
అయితే ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన జర్సీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా కూడా చరణ్ అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆయనకు దెబ్బ పడిన తగ్గకుండా ముందుకు వెళ్తున్నాడు.
అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం చరణ్ కు నమ్మకం కలిగిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేస్తాడట.అందుకే గౌతమ్ తిన్ననూరి కూడా స్క్రిప్ట్ ను మరోసారి మార్పులు చేసి రెడీ చేసున్నాడట.