యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనుభవించు రాజా. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి అంచనాలే నెలకొన్నాయి.
ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.అంతేకాదు చరణ్ చిత్ర బృందానికి విషెష్ కూడా తెలిపారు.
ఈ సినిమా మొత్తం కోడి పందేలు, పేకాట వంటి విలాసాలను చూపించారు.
ఈ టీజర్ లో ముందుగా భీమవరం లో జరిగే కోడి పందేలు సెటప్ తో స్టార్ట్ అయ్యింది.‘అనుభవించు రాజా‘ అంటూ పాత పాట ప్లే అవుతూ ఉండగా రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా చూపించారు.ఆ తర్వాత రాజ్ తరుణ్ డైలాగ్స్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.
బంగారం గాడు ఊరిలో ఉండగా.ఆడి పుంజు బరిలో ఉండగా ఇంకొకడు గెలవడం కష్టం అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
ఈ సినిమా మొత్తం కోడి పందేలు, పేకాట, డాన్స్ లు వంటి వాటికీ అలవాటు పడ్డ జల్సా రాయుడిగా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ కూడా ఈ టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రాజ్ తరుణ్ పాత్ర ద్యాంతం ఉల్లాసవంతంగా కనపడింది.
పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో అలా చూపించడం ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మస్తున్నారు.
త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించ బోతున్నారు.ఇక టీజర్ తోనే అభిమానులను ఈ సినిమా వైపుకు తిప్పుకున్నారు చిత్ర యూనిట్.